వచ్చి ఏడాది మార్చి లోపు ఢిల్లీలో భవన నిర్మాణం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం రివ్యూ నిర్వహించారు. 19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వాటితోపాటు గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్పిటల్, పటౌడీ గ్రాండ్‌ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కి వివరిస్తానని వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోపు భవన నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉమ్మడి భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదన్నారు. డిజైన్లు ఖరారు చేసి, టెండర్లు పిలిచి ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు

Leave A Reply

Your email address will not be published.