హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గుంటూరుజిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం విషయంలో చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారని, బాధ్యులైన అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ హైకోర్టులో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఆపార్టీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.