తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుమలలో పెరటాసి మాసం సందర్భంగా గత కొన్నిరోజులుగా నెలకొన్న భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగింది. నాలుగు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. నిన్న రాత్రి వరకు స్వామివారిని 81,034 మంది దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రూ.4.24 కోట్ల ఆదాయం లభించింది.