కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు కోర్టు ఆదేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆంధ్రప్రదేశ్: కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. కేసుకు సంబంధించి కోడికత్తిమరో చిన్నకత్తిపర్సుసెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్‌ 10కి వాయిదా వేసింది

Leave A Reply

Your email address will not be published.