సీఎం, డీసీఎంలు సహా 36 మంది కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం సిద్ద రామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తోపాటు 36మంది కాంగ్రెస్ ముఖ్యులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బెం గళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. జూలై 28న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సూచించింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన మేరకు కోర్టు స్పందించింది. కంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు, అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై నివాసం ఎదుట ఆందోళన చేశారు. హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో 36మందిపై కేసులు న మోదై ఉండేవి. సీఎం, డీసీఎంలతోపాటు రాష్ట్ర పార్టీ వ్య వహారాల ఇన్చార్జ్ రణదీప్సింగ్ సుర్జేవాలాకు సమన్లు జారీ అయ్యాయి.