తిరిగి కాషాయం కండువా కప్పుకొండి
- బీజేపీ ని వీడిన నేతలకు తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి పిలుపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ ని వీడిన నేతలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు. తిరిగి కాషాయం కండువా కప్పుకోవాలని కోరారు. సమస్యలుంటే చర్చిద్దామని,.. సిద్ధాంతం కోసం పనిచేద్దామని బండి తెలిపారు. తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కలిసి పోరాడుదామని బండి అన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని, బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో అవకాశాలు ఉండవని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి విజయశాంతి అని బండి సంజయ్ అన్నారు