కర్ణాటకలో గోమాతను కోసి హింసించడం రాబోయే నిరంకుశ పరిపాలనకు నాంది

- తీవ్రంగా ఖండించిన ఇండియన్ ప్రజా కాంగ్రెస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలో గోమాతను బీజేపీ. జెండాపై కోసి హింసించి ఆనందపడుతున్న వైనం మానవత్వాన్ని మంట కలిపిందని ఇండియన్ ప్రజా కాంగ్రెస్  పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షురాలు సివలెంక నాగ ఉదయలక్ష్మి తెలిపారు. మత కాలుష్యాన్ని సృష్టిస్తున్న ఇట్టి చర్యలు హృదయవిదారకంగా వుందని…దీనిని యావత్ సమాజం ఖండించాలని ఆమె అన్నారు.కాంగ్రెస్ నాయకత్వం ప్రారంభం లోనే విధ్వంసాలు చోటు చేసుకోవడం  రాబోయే నిరంకుశ పరిపాలనకు నాంది పలుకుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.గోమాతను అమానుషంగా ఒక మూగ జీవిపై దుశ్చర్యలు సహించమని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు..ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పంచసూత్రాలలో గోసంరక్షణ ప్రధాన అంశమని జాతీయస్థాయిలో గోవధ నిషేధంకోసం కృషి చేస్తామని ఉదయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోగోసంరక్షణ విషయంలోతగిన కార్యాచరణ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకంగా పరిపాలన చేయాలని ఉదయలక్ష్మి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.