సీపీఆర్ ప్రక్రియ ద్వారా కార్డియాలాజి మరణాలను తగ్గించుకోవచ్చు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కార్డియాక్ అరెస్టుఎవరికైనా రావొచ్చు.. అది రావడానికి సమయం, సందర్భం లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపేర్కొన్నారు. మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు. ప్రతి రోజు సగటున 4 వేల మంది చనిపోతున్నారు. ఈ చనిపోతున్న వారి సంఖ్యను సీపీఆరప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. కానీ సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేయగలిగితే 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చని డబ్ల్యూహెచ్వోతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి అని మంత్రి హరీశ్రావు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో సీపీఆర్()శిక్షణను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆ కొద్ది నిమిషాల్లో సీపీఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను బతికించుకోవచ్చు. తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి 24 వేల మంది చనిపోతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సీపీఆర్ శిక్షణ బాగా చేయగలిగితే ఇందులో సగం మందిని కాపాడుకోవచ్చు. సీపీఆర్ చేసేందుకు అవగాహన, శిక్షణ మాత్రమే అవసరం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
సీపీఆర్ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే సెక్యూరిటీతో పాటు ఇతరులకు కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడటమే సీపీఆర్ లక్ష్యం. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ మారిపోయింది. చెడు అలవాట్లకు అలవాటుపడ్డారు. ఆహారపు అలవాట్లు మారాయి. పని ఒత్తిడి కారణంగా షాక్స్ వస్తున్నాయి. కరోనా తర్వాత కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయి. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య రక్షణ కోసం లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి. సీపీఆర్ ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పిస్తాం. సీపీఆర్ను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వరకు తీసుకెళ్లేందుకు వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోంది అని హరీశ్రావు పేర్కొన్నారు.