నేడు వెంకటేశ్వరాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

.. హాజరుకానున్న స్పీకర్, మంత్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శనివారం సాయంత్రం 4 30 నిమిషాలకు తెలంగాణ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్మాపూర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నసురుల్లాబాద్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు పెర్క శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, సినీ తారలు పాల్గొంటున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామ రైతుబంధు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు పిఎస్ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.