ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురంధేశ్వరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి), మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్‌ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. అనంతరం పురంధేశ్వరికి బీజేపీ నేతలు శాలువాలుపుష్పగుచ్చాలతో సత్కరించారు.అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.