దళితుల హక్కుల పోరాట సమితి సంగెం గ్రామ కమిటీ ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: సంగెం గ్రామంలో దళితుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకులు గరుగళ్ల బాలరాజ్, మోచి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు-గైని సాయిలు,ప్రధాన కార్యదర్శి-కల్లేటి సాయిలు, ఉపాధ్యక్షుడు-అడ్లూరి చిన్న గంగారం,కొక్కిరి సాయిలు,కోశాధికారి-బెగరి సంతోష్,జాయింట్ సెక్రటరీ-కొక్కిరి మహేందర్,కార్య నిర్వాహక కార్యదర్శి-నందు, సలహాదారులు-కొక్కిరి గంగారం,అడ్లూరి సాయిలు,బేగరి గంగారం,
కార్యవర్గ సభ్యులు-కల్లేటి భూమయ్య,గైని శ్రీనివాస్,నిజామాబాద్ గంగారం, గైని తనాజీ
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గరిగొల్ల బాలరాజ్ మాట్లాడుతూ దళితుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతుందని, దళితులందరూ కలిసి ఒకే తాటిపై నిలబడే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ అయ్యల సంతోష్,కాశిరం, సాయిరాం,కొక్కిరి సాయిలు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.