గులాబీ గూటికి దాసోజు శ్రావణ్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ నడుస్తోంది. సాయంత్రం దాసోజు శ్రవణ్‌ గులాబీ గూటికి చేరనున్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు దాసోజు. ఇప్పటికే బీజేపీని వీడుతున్నట్టు బండి సంజయ్‌కు దాసోజు లేఖ రాశారు. తెలంగాణ బీజేపీలో అనిశ్చితమైన రాజకీయ పరిణామాలు ఉన్నాయని, మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందని లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు సంచులు, కాంట్రాక్టర్లే రాజ్యాలు ఏలేలా రాజకీయాలు ఉన్నాయన్న దాసోజు.. ఎన్నో ఆశయాలతో తాను గతంలో బీజేపీలో చేరానని, కానీ.. తెలంగాణ సమాజానికి బీజేపీ తీరుతో మేలు జరిగేలా లేదని అన్నారు. విచ్చలవిడిగా నోట్లకట్టలు పంచి బీజేపీ గెలవాలనుకుంటోందని, దీనిని నిరసిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని బండి సంజయ్‌కు రాసిన లేఖలో దాసోజు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కొంతకాలం కిందటే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లారు దాసోజు శ్రవణ్. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇంతకాలం తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో బీసీ ఓట్లే లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ గూటికి బూర నర్సయ్య గౌడ్ చేరగా దానికి కౌంటర్‌గా గులాబీ కండువా కప్పుకున్నారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఇప్పుడు తాజాగా దాసోజు శ్రవణ్‌ కూడా కారు ఎక్కుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయాయి.

Leave A Reply

Your email address will not be published.