ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించిన డిసిసిబి చైర్మన్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుళ్లబాద్ మండల కేంద్రము లో తహసిల్ కార్యాలయం వద్ద ఆధార్ నమోదు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ప్రజలు ఆధార్ కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నసురుళ్ళబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.