ఇంటింటి ప్రచారం చేసిన డిసిసిబి చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

చౌటుప్పల్ మండల చిన్న కొండుర్ గ్రామంలో పలు వార్డులలో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకుల తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తన స్వంత ప్రయోజనాల కోసం వేల కోట్లకు అమ్ముడుబోయీ తెచ్చుకున్న ఎన్నిక ప్రజలందరూ ఇది గమనించి జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్రం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న తెరాసా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు , కొనసాగుతున్న సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన అభ్యర్థి శ్రీ.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక తెరాసా పార్టీ మరియు సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.