ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం ఆరుగురు మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటో, బైక్ను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను మోతి ఘనాపూర్ వాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.