ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం ఆరుగురు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్‌ సమీపంలో ఆగివున్న ఆటో, బైక్‌ను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను మోతి ఘనాపూర్‌ వాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.