గౌహతిలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి(జాయింట్ పోలీస్ కమిషనర్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్ చెప్పారు.ప్రాథమిక విచారణ ప్రకారం మృతులు విద్యార్థులని ప్రతీక్ పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. అతి వేగంగా వచ్చిన కారు గూడ్స్ వాహనాన్ని ఢీకొందని పోలీసులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.