ధనిక రాష్ట్రమైన తెలంగాణ లో తగ్గిపోతున్న స్థిరాస్తులు

- తప్పుడు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న తెలంగాణా ప్రభుత్వం  - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఎన్ వి  ఎస్ ఎస్ ప్రభాకర్  పిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను రాజ్యసభలోని మంత్రి కార్యాలయంలో ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు   ఎన్ వి  ఎస్ ఎస్ ప్రభాకర్  మరియు జి మనోహర్ రెడ్డి కలిసి అర్థగంటసేపు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, ప్రభుత్వం అనుసరిస్తు  తప్పుడు ఆర్థిక విధానాలపై.  ఆదాయ వనరులు పెంచుకోవడం కొరకు పూర్తిగా మద్యం అమ్మకాలపై మరియు భూముల  అమ్మకాల మీదనే  ఆధారపడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకొని వెళ్లారు . స్థానిక సంస్థల అభివృద్ధికై కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా కూడా పక్క దారి పట్టాయని . పంచాయతీల జీతభత్యం ,కొరకు విద్యుత్తు బిల్లుల కొరకు, ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్ల కొరకు మళ్లిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న విషయాన్ని ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆవాస్ యోజన ,సడక్ యోజన  స్మార్ట్ సిటీ పనులు నిధులు కూడా అలాగే జరుగుతున్నాయని తెలియజేశారు . కేంద్ర ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయక విద్య ,వైద్య ,ఉపాధి, రంగంలో మునిగిపోతున్నాయని  ప్రభాకర్   పేర్కొన్నారు  రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారులకు తెలియజేస్తూ రసీదులు ఇస్తున్నదో అలాగే ప్రతి ప్రతి పనిలో కూడా జరిగేటట్టు చూడాలని బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిని కోరారు. ఎఫ్ ఆర్ బి ఎం పెంచుకుంటూ పోతే మరింత దివాలా కోరు పరిస్థితి దాపరించే అవకాశం ఉందని వారి దృష్టికి తీసుకెళ్లారు ఖజానా ఖాళీ అవ్వడంతో. మద్యం అమ్మ కాలనీ కూడా ముందస్తుగా  అప్లికేషన్స్ మరియు టెండర్లు తీసుకొచ్చి    నిధులు సమకూర్చుకోవటం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి  ధనిక రాష్ట్రమైన తెలంగాణ లో  స్థిరాస్తులు తగ్గిపోతున్నాయని  .  తెలంగాణ ప్రజలకు,   ఉద్యోగులకు  విద్యార్థులకు ఇది అర్థమైందని ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టడం కొరకు ఆర్థికపరమైన సమీక్షని నిర్వహించాలని కేంద్రమంత్రిని కోరారు .ప్రభుత్వ శాఖ లా పరమైన సమీక్షలు ఇప్పటికే ప్రారంభమైనాయని ఇవి కొనసాగుతాయని  కేంద్ర ఆర్థిక మంత్రి తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.