తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఓ నెటిజన్ కేటీఆర్కు ట్వీట్ చేశారు. రిసార్ట్తో పాటు బోటింగ్ కాయకింగ్ పారాసైలింగ్ వంటి ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందని ఆ నెటిజన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. వారాంతాల్లో మంచి టూరిస్ట్ ప్లేస్గా ఈ ప్రాంతం గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు.ఈ ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ.. చెరువు అభివృద్ధి గల అవకాశాలను అన్వేషించాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు.హైదరాబాద్ – విజయవాడ హైవేకు కుడి వైపున ఇబ్రహీంపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించారు.