అల్లమాప్రభు కు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిది: బోమందేవ్ పల్లి
కామారెడ్డి జిల్లా,నసురుళ్లబాద్ మండలం బోమందేవ్ పల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన అల్లమా ప్రభు దేవున్ని చుట్టూ పక్క గ్రామాలనుచే కాకుండా కర్నాటక&మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు, ఈ రోజు శనివారం అమావాస్య కావడంతో ఉదయం 6 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తీ శ్రద్దలతో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు, అల్లామా ప్రభు గుట్టకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం తో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొమ్మనదేవ్ పల్లి గ్రామ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు రాత్రి కి అగ్గిగుండం ఉంటుంది,, రేపు ఆదివారం నిండు జాతర’ మరియు రథం తిరుగుతుంది *ఎల్లుండి సోమవారం కుస్తులు నిర్వాసిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.