బిల్లుల వసూళ్లలో తేడాలు ..14 మంది విద్యుత్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యుత్‌ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్‌ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్‌ నోటీసులుజారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఇంత పెద్ద సంఖ్యలో అధికారులకు షోకాజ్‌ నోటీసులు అందించడం ఇదే ప్రథమంగా భావిస్తున్నారు.నాగర్‌ కర్నూలుజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో నెలకు రూ. 9.32 లక్షలు తేడా రావడాన్ని విజిలెన్స్‌ అధికారులుగుర్తించారు. ఈ విషయాన్ని ఎస్పీడీసీఎల్‌నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 9 మంది ఏఈఈలు, నలుగురు ఏడీఈలు, ఒక డీఈకి నోటీసులు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.