ఉత్తర ప్రదేశ్ లో కుంగిపోయిన ఎక్స్ ప్రెస్ వే

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే కుంగి ప్రధాన రహదారిపై 15 అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న కారు అందులో పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. లక్నో నుంచి ఘాజీపూర్ను అనుసంధానించే ‘ఎక్స్ప్రెస్ వే’ను 2021 నవంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఎక్స్ప్రెస్ వే.. ఒక్క వర్షానికే కుంగిందని కాంగ్రెస్ విమర్శించింది.

Leave A Reply

Your email address will not be published.