నీటి గుంతలో దిగి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల ఓ నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం నసురుల్లాబాద్ లో గత కొన్ని సంవత్సరాల నుండి సీసాక మరి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న లక్ష్మణ్ (35) అనే వ్యక్తి తన వద్ద గల ఐదు గొర్రెలను మేపుతూ మైలారం శివారులోకి వెళ్ళాడు. ఈ క్రమంలో మైలారం గ్రామ శివారులో రాజరాజేశ్వర ఆలయం సమీపంలో తవ్విన గుంతలు ఈ వర్షానికి నీటితో పూర్తిగా నిండుతుంది. ఈ నీటిగుంట లోతు తెలియక లక్ష్మణ్ అందులో దిగి ప్రమాదవశాత్తు ఈతరాక మరణించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకొని మైలారం, నసురుళ్లబాద్ గ్రామాల సర్పంచులు యశోద మహేందర్, అరిగే సాయిలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నసురుళ్లబాద్ ఏఎస్ఐ వెంకట్రావు వారి సిబ్బంది హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి శుభ పంచనామా అనంతరం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు ఎస్సై వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.