లష్కర్ బోనాలలో అపశృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి వర్షం కారణంగా కరెంట్ పోల్‌కు పవర్ సప్లై కాగా.. దాన్ని ముట్టుకొని చనిపోయాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ (27) సేల్స్‌మెన్‌గా బేగం బజార్‌లో పని చేస్తున్నాడు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వచ్చాడు. అమ్మవారిని దర్శించుకొన్నాడు.అనంతరం రాత్రి వర్షం కురవటంతో మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ చోట ఆగాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి కరెంట్ సప్లై కాగా.. ప్రమాదవశాత్తు దాన్ని ముట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గంతలో కూడా ఓ వ్యక్తి ఇదే విద్యుత్ స్తంభానికి తగిలి షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. అయినా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.లష్కర్ బోనాల సందడి.. మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులుఅట్టహాసంగా రంగం కార్యక్రమంఇదిలా ఉండగా.. లష్కర్ బోనాలు రెండో రోజు వైభంగా సాగుతున్నాయి. బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. గతేడాది ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించారని భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని..కొన్ని ఒడుదొడుకులు ఉంటాయని చెప్పారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.ఈ ఏడాది బోనాలు ఉత్సవాలు బాగా జరిపించారని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా పూజలు జరిపినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తన వద్దకు వచ్చిన ప్రజలందరిని కాపాడుకుంటానని భవిష్యవాణిలో అమ్మవారు వెల్లడించారు. ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటాని చెప్పారు. తనకు ఐదు వారాల పాటు సాక పట్టాలని కోరారు. గడప గడపను కాపాడే బాధ్యత తనదేనని అన్నారు. భక్తులు ఏ పూజలు చేసినా.. సంతోషంగా, ఆనందంగా అందుకుంటున్నానని రంగం కార్యక్రమంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.ఇక కాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఉరేగింపు ఉంటుందని చెప్పారు. ఈ సారి బోనాలు ఉత్సవాలు వైభంవంగా జరుపుకున్నామని.. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారన్నారు

Leave A Reply

Your email address will not be published.