బాన్సువాడలో ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ పరిధిలోని 13 వ వార్డులో కాలనీ వాసులకు మున్సిపల్ కమిషనర్ రమేష్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ చెత్తబుట్టల మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం బాన్సువాడ పట్టణం స్వచ్ బాన్సువాడ గా చేయాలన్న సంకల్పంతో ప్రతి వార్డులలో చెత్త ను మున్సిపాలిటీ వారు ఇస్తున్న బుట్టలలో తడి చెత్త పొడి చెత్త గా వేరు వేరు చేసి రోజు మున్సిపల్ ఆధ్వర్యంలో పంపించే చెత్త ఆటో లో వేసి పరిసరాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ రమేష్,స్థానిక కౌన్సిలర్ బాడీ శ్రీను,నార్ల ఉదయ్,కుషాల్ సర్,భాగ్యశ్రీ రమేష్,మల్లేష్,సాయి,వార్డు ప్రజలు ఉన్నారు.