పంచాయతీ కార్మికులకు పోషకాహారం సరుకుల పంపిణీ

నసురుల్లాబాద్, లోకల్ టైమ్స్ ప్రతినిధి:నసురుల్లాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నసురుళ్లబాద్ మరియు అంకోల్ క్యాంపు పంచాయతీ కార్మికులకు రొయ్యూరి సురేష్ ట్రస్ట్ వారి సహకారంతో పోషకాహారంతో కూడిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య లోపించకుండా పంచాయతీ కార్మికులు నిత్యం శ్రమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని, వారి ఆరోగ్య రక్షణ రీత్యా ఈ పోషకాహారం నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు అంకోల్ క్యాంప్ వెంకటరమణ, లయన్స్ క్లబ్ మండల సెక్రటరీ నెమ్లి అంబెంమోహన్, లయన్స్ క్లబ్ జోనల్ సెక్రటరీ కంది మల్లేష్, ఎంపీపీ విఠల్, తెరాస మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్, నసురుల్లాబాద్ గ్రామ స్థానిక సర్పంచ్ అరిగే సాయిలు, జిల్లా కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్, చుంచు సాయిలు, ఖలీల్, జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రాజేష్, ప్రతాప్ సింగ్, మండల లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.