న్యాక్ ఆధ్వర్యంలో 160మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాధి కల్పనలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలుస్తుందని, స్వరాష్ట్రంలోనే మహిళ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, పాలన దక్షతలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతోనే.. ప్రతి రంగంలో మహిళమణులు దూసుకెళ్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) వారి ఆధ్వర్యంలో 160మంది మహిళలకు కట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకే వలస వస్తున్నారని, మహిళలు స్వయం కృషితో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని, మహిళల రక్షణకోసం షీటీమ్స్ను ఏర్పాటు చేశారని, అమ్మాయిల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు.మహిళలు కుట్టు మిషన్లో ప్రత్యేకతను కనబర్చి, ఇతరులకు ఉపాధిని కల్పించి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు ఏకే మురుగేష్, లలితాయాదవ్, జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, నిహారికగౌడ్, మెట్టు ఆశాకుమారి, లావణ్యసతీష్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, వేణు, శారదామనోధర్రెడ్డి, పల్లపు రవి, వేణు, కోఆప్షన్సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, న్యాక్ అధికారులు, నాయకులు సాధిక్, ప్రకాష్, నవీన్యాదవ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.