ప్రజలను మోసం చేసే బి.ఆర్.ఎస్ మేనిఫెస్టో నమ్మవద్దు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఒక్క ఛాన్స్ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని, దళితుడిని మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని చేస్తామని వచ్చి కుటుంబ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఒక్క ఛాన్స్ అనే వాళ్ళని నమ్మొద్దు, ఓట్లు వేయద్దు అనడం పెద్ద కామెడీ గా ఉందని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కుమారి యామిని లక్ష్మి అన్నారు. చిక్కడపల్లి లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ అంతే కాకుండా ప్రజలని మభ్య పెట్టే మేనిఫెస్టో ఇంకో పెద్ద జోక్ అని, ఒక పక్క TSPS ఎగ్జామ్స్ క్యాలెండరు ఇవ్వకుండా, గ్రూప్ 2 పరీక్షలను పోస్టుపోన్ చేసి ఇక్కడ ప్రవల్లిక అనే విద్యార్థిని ఆత్మహత్య కి కారణమయ్యారని విమర్శించారు. ప్రజలని పనికిరాని దద్దమ్మలాగా తయారు చేసే పథకాలను బిఆర్ఎస్ చేస్తుందనీ ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమం లో భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చింతాడ సూర్యం, రాష్ట్ర అధ్యక్షులు కాజా,హేమలత, స్థాన్లీ జోనాథన్, పొట్ట మధుకర్ ,, స్వప్న, రాజేశ్వరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.