మరో అవార్డును అందుకున్న డాక్టర్ అయ్యాల సంతోష్
Dr. Ayyala Santhosh received another award
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సామాజిక సేవ రంగంలో కృషి చేసిన వారికి తెలంగాణా రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో బుధవారం అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న దేశాయిపేట్ గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు అయ్యల సంతోష్ కు ఎక్స్లెన్స్-2023(Excellence-2023) అవార్డ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ ఈ అవార్డ్ చాలా సంతోషంగా ఉందని, ఎల్లప్పుడూ సమాజం కోసం పనిచేస్తానని, నేను చేస్తున్న కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తున్న, మిత్రులకు,నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి,TRVS అధ్యక్షులు మహ్మద్ మున్న, షేక్ నయీమ్,సామజిక కార్యకర్త డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.