కిషన్ రెడ్డిని  కలిసి అభినందనలు తెలిపిన డాక్టర్ ఐజాక్ రాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ డాక్టర్ ఐజాక్ రాజ్ గురువారం  ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపిని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించుకోవడానికి కృషి చేయాలని అందరూ సహకరించాలని కోరారు. కిషన్ రెడ్డికి  శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ డిసిపి ప్రభాకర్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.