మహానగరంలో రోడ్లపైకి డ్రైనేజీ నీరు

.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీవాసులు

పేరుకే మహానగరం ఎక్కడ చూసినా నగరంలోని పలు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్లలోని మురికి నీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లుతుంది . దీంతో రహదారుల గుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ ఫిలింనగర్, ఎమ్మెల్యే కాలనీ ,ఎన్బిటి నగర్, పెన్షన్ ఆఫీస్ చింతల్ బస్తి ,ఖైరతాబాద్ మాదాపూర్ ,ఏరియాలో రహదారుల వెంబడి డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది .ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు ఈ మురికి నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోద్యం చూస్తున్న మహానగర పాలక శాఖ అధికారులు . నగరంలో నెలకొన్న పారిశుధ్యం , డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం మహానగర పాలక శాఖ అధికారులు విఫలమయ్యారని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. వెంటనే మహానగర పాలక శాఖ అధికారులు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించే అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.