బడి మానేసి బీడీలు చుట్టి .. న్యాయమూర్తిగా ఎదిగాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు మానేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టింది. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశాడు. అయితేనేం ప్రస్తుతం అమెరికాలో న్యాయమూర్తిగా నియమితురాలై తీర్పులు చెబుతున్నారు. కేరళలోని కాసరగోడ్‌ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్‌ కే పటేల్‌ ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్‌. తన జీవితాన్ని మార్చుకునేందుకు.. ఉన్నత చదువుల కోసం గ్రామంలోని తన స్నేహితులను సాయంతో లా డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్‌.

Leave A Reply

Your email address will not be published.