అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ఆరోగ్యం చేయించడంతో హుటాహుటిన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని వారి కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్రువీకరించారు ప్రస్తుతం శ్రీనివాస్ కు చికిత్స కొనసాగుతుందని తన తండ్రి అనారోగ్య కారణం వల్ల ఇవాళ రేపటి తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు ఎంపీ అరవింద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసిగా పనిచేసిన డీఎస్ ప్రత్యేక తెలంగాణ అనంతరం టిఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. ఆయన తన పదవిని రెన్యువల్ చేసుకోకపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిన్నపాటి విభేదాల వలన ఆయన ప్రస్తుతం బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.