నాన్నతో డిఎస్ కు ఉన్న బంధం మరువలేనిది
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ మరణంపై వైసీపీ చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డీఎస్ కు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు. ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వర్తించి చాలా రాజకీయ నాయకులకు డీఎస్ ఆదర్శప్రాయుడిగా ఉన్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.