దుర్గా భవాని విగ్రహ దాతకు ఘన సన్మానం

తెలంగాణజ్యోతి/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యువ భారత్ దుర్గామాత మండపంలో విగ్రహ దాత నసురుల్లాబాద్ గ్రామానికి కే.జగదీష్- సప్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా దుర్గామాత మండపం నిర్వాహకులు జగదీష్ – సప్న దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహ దాత కే .జగదీష్ మాట్లాడుతూ. దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువభారత్ దుర్గా భవాని యువకులు అడగగానే అమ్మవారి విగ్రహం కోసం విరాళం అందజేయడం జరిగిందని , అని అంతా ఆ అమ్మవారి దయ అన్ని దుర్గామాత ఆశీర్వాదంతో మండల ప్రజలందరూ సుఖ : సంతోషాలతో, పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ దుర్గాభవానిని వేడుకోవడం జరిగింది, అని ఆయన మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.