ఖట్మండు, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేపాల్ దేశంలోని ఖట్మండుభారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది. నేపాల్ దేశ రాజధాని నగరమైన ఖట్మండ్ లో శనివారం తెల్లవారుజామున 3.04 గంటలకు భూకంపంవచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. గతంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో భారీ నష్టం సంభవించింది.భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోనూ శుక్రవారం రాత్రి 11.56 గంటలకు భూకంపం సంభవించింది. 28 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. మార్చి 24వతేదీన కూడా అంబికాపూర్ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో భూమి కంపించింది. పోర్ట్ బ్లెయిర్ కు 140 కిలోమీటర్ల దూరంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.