నేపాల్ లో రెండు సార్లు భూకంపం…భయాందోళనల్లో జనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేపాల్ దేశంలో గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించిందినేపాల్ దేశంలోని బజురా దహకోట్ ప్రాంతంలోసంభవించిన భూకంపాలు రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.అర్ధరాత్రి రెండు సార్లు భూకంపం సంభవించడంతో ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు.రాత్రివేళ వరుస భూకంపాలు సంభవించడంతో జనం కలవరపడ్డారు. గతంలో నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించడంతో భూమి కంపించినపుడల్లా నేపాల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. గత భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా జరిగింది.

Leave A Reply

Your email address will not be published.