జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. గుల్ మార్గ్ లో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్ ) తెలిపింది. ఉదయం 8:36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు.. 35.46 అక్షాంశం, 73.32 రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. ‘‘05.08.2023 రోజున భారత కాలమానం ప్రకారం 08.36 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప లోతు 129 కిలోమీటర్లుగా ఉంది. ’’ అని ఎన్సీఎస్ ట్వీట్ చేసింది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, వస్తు నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదు.