కవితకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. కాగా కవిత ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అటు విచారణకు మరింత సమయం కావాలని కవిత కోరింది. తన లీగల్ అడ్వైజర్ ను ఈడీ ఆఫీస్ కు పంపింది.