బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకులు నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడాన్ని భరించలేక తమపై దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని విమర్శించారు. ఈడీ ద్వారా నోటీసు పంపి.. అందులో ఏ కేసు గురించి అడుగలేదని, వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. మొదటి రోజు ఆరు గంటలు విచారించారని, ఏ కేసు విషయంలో విచారిస్తున్నారో చెప్పలేదని, ఎలక్షన్ అఫిడవిట్ గురించి సమాచారం అడిగారని చెప్పారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. కేసుకు సంబంధంలేని అభిషేక్ను విచారించారని, పొంతన లేని వివరాలను అడిగారని ఆరోపించారు.