బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం 50 శాతం కు పెంచాలి

.. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పడుడాల సుదాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుప్రీంకోర్టు ఇడబ్లుఎస్ రిజర్వేషన్లను సమర్ధిస్తూ  తీర్పు చెప్పినందున జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యాఉద్యోగ రంగాలలో,స్థానిక సంస్థల ఎన్నికలలో కేంద్రంలో 27 శాతం నుంచి 50శాతం పెంచాలనిచట్టసభలలో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పడుడాల సుదాకర్ డిమాండ్ చేసారు.       రిజర్వేషన్లపై ధించిన గరిష్ట పరిమితి 50 శాతంనూ సుప్రీం కోర్టు తొలగించినందున ఎలాంటి న్యాయపరమైనరాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బిసి/ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేసారు. ఇటీవల ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు చెల్లుతాయని50% గరిష్ట పరిమితి కూడా సరికాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ 50 శాతం గరిష్ట పరిమితి తొలగించి ఇడబ్లుఎస్ – లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీనితో రిజర్వేషన్లపై ఉన్న గరిష్ట పరిమితి తొలగిపోయింది. రిజర్వేషన్లపై న్యాయపరంగాచట్టపరంగారాజ్యాంగపరంగా  యున్న అవరోధాలు తొలగిపోయాయి.  కావున వెంటనే బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కేంద్రంలో 27 శాతం నుంచి 50 శాతం  పెంచాలని కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకుసామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకుఅన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు.బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ – పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అందిచేస్తున్నారని విమర్శించారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.