లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో ఛార్జ్ షీట్ దాఖలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణంలో మూడో అదనపు ఛార్జ్ షీట్ను ఈడీ దాఖలు చేసింది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్ సింగ్ ధాల్పై 3 వ ఛార్జ్ షీట్లో అభియోగాలు మోపింది. మద్యం విధానంలో అక్రమాలు, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి అభియోగాలు మోపడం జరిగింది.ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ ముందు ఈడి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మట్ట చార్జిషీట్ దాఖలు చేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జి షీట్ను పరిగణనలోకి తీసుకోవడంపై నేడు (శుక్రవారం) ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది.