జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపిన ఎర్రబెల్లి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి ( కె.ఎల్.రెడ్డి, 91) మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కె.ఎల్.రెడ్డి, జర్నలిస్టుగా ఎక్కువ కాలం వరంగల్ లోనే గడిపారన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను, అతనితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.