ఆర్దికంగా వెనుక బడిన వారు కుడా బిసిలే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాష్ట్రములో ఆర్దికంగా వెనుక బడిన వారు కుడా బిసిలే నని, వారిని గుర్తించి ఈ వర్గాల వారికి  కులాలకు అతీతంగా  సహాయ సహకారాలు అందించాలని బిసి ఐఖ్యవేదిక ఇబిసి విబాగం గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షురాలు వాణి రెడ్డి పిలుపు నిచ్చారు.ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం లో బిసి సంఘం నాయకుడు జగన్ కూతురు వివాహానికి హాజరైన సందర్బంగా ఆమె మీడియా తో మాట్లాడారు.నేడు రాష్ట్రము బిసి వర్గాలే కాకుండా ఉన్నత వర్గాల్లోకుడా నిరుపేదలు ఉన్నారని వారిని ఇబిసి లు గా గుర్తించి వారిని  పట్టించుకోవలసిన అవసర ఎంతైనా ఉందన్నారు. బిసి లు, ఇబిసి లకోసం  రాజ్యసభ సబ్యులు,బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తాను ఒసి వర్గానికి చెందినప్పటికీ ఆర్. కృష్ణయ్య స్పూర్తి తో ఇబిసి వర్గాల అబ్యున్నతి కోసం  కృషి చేస్తానన్నారు.ఈ సమావేశంలో మర్రిగూడెం సర్పంచ్  యాదగిరి రెడ్డి ,నల్లగొండ జిల్లాకు చెందిన బిసి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.