కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో జూపల్లి చేరిక ఈరోజు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి ప్రకటించారు. తిరిగి రేపు అనగా గురువారం ఉదయం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, కూచుకుల్లా రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. త్వరలోనే బీజేపీ నుంచి చేరికలు ఉంటాయని చెప్పారు. రాజకీయ పునరేకికరణలో భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సీనినటి,మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని మల్లురవి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.