రష్మిక మందన్న పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: షూటింగ్ కు ముందు నిజాలు తెలుసుకోండి అంటూ హీరోయిన్ రష్మిక మందన్న పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రే. ఇటీవల ఆమె ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ పై చేసిన వీడియో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో చేసినందుకు ఆమె కు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ..సడన్ గా ఆమె ప్రస్తుత ప్రభుత్వం కోసం ప్రచారం చేయటం ఆశ్చర్యం కలిగించింది అన్నారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే ఎక్స్ వేదికగా పలు విషయాలు ప్రస్తావించారు. అటల్ సేతు ప్రాజెక్ట్ పనుల్లో 85 శాతం పూర్తి చేసింది అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేసింది కేవలం 15 శాతం పనులే అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత కూడా విఐపీ సమయం దొరక్క మూడు నెలలు ఆలస్యంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.