ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి గ‌ర్భిణుల‌కు మిన‌హాయింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి గ‌ర్భిణుల‌కు మిన‌హాయింపు ఇచ్చారు.ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొన‌కుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు క‌ల్పించారు. మెయిన్స్‌లో ఒక వేళ పాసైతే.. నెల రోజుల్లోపు ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అధికారుల నియమావ‌ళిని అంగీక‌రిస్తూ గ‌ర్భిణులు లేఖ రాసివ్వాల‌ని నిబంధ‌న విధించారు.

Leave A Reply

Your email address will not be published.