వీరికి మాత్రం రైతు రుణమాఫీ వర్తించదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంట్లో రుణమాఫీ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలను పేర్కొంది. దీని ప్రకారం చాలా మందికి రుణమాఫీపై ఊహించని షాకిచ్చింది. దీంతో తెలంగాణా వ్యాప్తంగా రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు.

రేవంత్ సర్కార్ తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పంటలు సాగుచేసే వారికి ముఖ్యంగా మామిడి, నిమ్మ, బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలకు రుణ మాఫీ రాదు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, దీర్ఘకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది. వరి, చెరుకు, పత్తి, కూరగాయలు వంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న పంటరుణాలకు ఈ పథకం వర్తించదని పేర్కొంది.

 

 

Leave A Reply

Your email address will not be published.