అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలి

-  తడిసిన దాన్యం కొనుగోలు చేయాలి - రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాలు ప్రారంభించాలి  -  ప్రభుత్వానికి రైతుహక్కుల రాష్ట్ర కార్యదర్శి బియ్యపు శంకర్ విజ్ఞప్తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలని  తడిసిన దాన్యం కొనుగోలుకు వెంటనే గ్రామాల్లో రైతులకు అందు బాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుహక్కుల రాష్ట్ర కార్యదర్శి బియ్యపు శంకర్ యాదవ్ డిమాండ్ చేసారు. జిల్లాలో ఇటీవల వరుసగా కురిసిన వడగండ్ల వర్షాలకు నష్ట పోయేన రైతులను పారమశించారు.నేరుగా కల్లలవద్దకు వెళ్లి  తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం  అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న పంటలు,దాన్యం, రైతుల గోడును  అదనపు కలెక్టర్ కుమార్ ను కలిసి వివరించి  వినతిపత్రం సమర్పించారు. అనంతరం బియ్యపు శంకర్ యాదవ్  మీడియా తో మాట్లాడుతూ  జిల్లాలో ఇటీవల వరుసగా కురిసిన వడగండ్ల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోరినట్లు తెలిపారు.వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని, గత మార్చిలో వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు హామీ ఇచ్చిన సీఎం మాట నిలబెట్టుకోవాలని బియ్యపు శంకర్ యాదవ్ డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేసారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల నగదుతోపాటు వచ్చే సీజన్లో పూర్తి సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలని శంకర్ యాదవ్  ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అలాగే ఇండ్లు దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు 5లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గత మార్చిలో కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మాటను వెంటనే నిలబెట్టుకోవాలని శంకర్ యాదవ్  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో  తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి బియ్యపు శంకర్ యాదవ్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఎస్.పి రాజం, జిల్లా ఉపాధ్యక్షులు తుంగాని సాయిలు,జిల్లా ప్రధాన కార్యదర్శి  రాజు యాదవ్, ఓదెల మండల ప్రధాన కార్యదర్శి బోయిని కుమార్, గోపరపల్లి గ్రామ కార్యదర్శి సంగ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.