ఐఏఎస్ శ్రీలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజధాని రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమరావతి రైతులు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించనందున చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయకపోవటాన్ని తప్పుబడుతూ సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. మొత్తం 22,948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు ప్రస్తావించారు.మరోవైపు అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌రెడ్డిఇంప్లీడ్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారని ఇంప్లీడ్ పిటిషనర్‌ తరఫున లాయర్ వాదించారు. ఇది సీఆర్‌డీఏ వద్ద ఉంటుందని.. ఈ ఫండ్‌ నుంచి సీఆర్‌డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని.. ఇది చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్ కథనాలు ఉన్నాయని.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరికాదన్నారు.సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని.. రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందన్నారు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్‌ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించడంపై రైతుల తరపు లాయర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండా ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలైందని తెలిపారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని పిటిషనర్ తరఫు‌ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించడంతో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు

Leave A Reply

Your email address will not be published.