రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వినిపించిన రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుండి మొదలైన పాదయాత్ర కామారెడ్డి జిల్లా నాసురుల్లాబాద్ మండలంలో ప్రవేశించింది. ఈ నేపత్యంలో మండలం లోని  అంకోల్ క్యాంపు గ్రామంలో రేవంత్ ను గ్రామానికి చెందిన రైతులు కలిసి సహకార సంగం వారు తమను వేధిస్తున్న విషయాన్నీ చెప్పుకున్నారు. కలిసి తమ గోడు వినిపిస్తూ సహకార కేంద్ర బ్యాంకులో రుణాలు తీసుకున్న తమను బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రుణాలు చెల్లించలేదని ఇంటి తలుపులు, ఇంట్లో పిల్లల ల్యాప్ టాప్ తీసుకెళ్లారన్న బాధిత రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.